ధోనీ భవితవ్యంపై చర్చ:
ముంబై బీసీసీఐ కార్యాలంలో అధ్యక్షుడు గంగూలీ సమక్షంలో గురువారం తొలిసారి అధికారిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశ క్రికెట్ రోడ్మ్యాప్ గురించి అందరూ చర్చించారు. ఇక సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై చర్చకు వచ్చినా.. ఎవరూ మాట్లాడలేదని సమాచారం తెలిసింది. యువ ఆటగాళ్ల గురించి కూడా చర్చలు జరిగాయట. టీ20 ప్రపంచకప్ కోసం మంచి జట్టును ఇప్పటి నుండే తయారుచేయాలని నిర్ణయించారట.
గంగూలీ సలహాలు, సూచనలు:
'భారత కెప్టెన్, వైస్ కెప్టెన్లను అధ్యక్షుడు, కార్యదర్శి కలువాలనుకున్నారు. దేశ క్రికెట్ రోడ్మ్యాప్నకు సంబంధించి చర్చ జరిగింది. బీసీసీఐ అధ్యక్ష హోదాలో గంగూలీ సలహాలు, సూచనలు చేశారు. కెప్టెన్ కోహ్లీ గంగూలీతో మాట్లాడాడు' అని సమావేశం తర్వాత బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రోడ్మ్యాప్ను సిద్ధం చేశాం:
ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఒక విషయం చెప్పగలను. టీ20 ప్రపంచకప్ కంటే ముందు ఎక్కువ మంది యువకులకు అవకాశాలిస్తాం. ఆటగాళ్లు నిరూపించుకునేందుకు ప్రోత్సహిస్తాం. రిషభ్ పంత్ బాగానే ఆడుతున్నా.. సంజూ శాంసన్కు చోటిచ్చాం. దీన్ని బట్టే మా ఆలోచనా విధానం అందరికి అర్థమై ఉంటుంది. ప్రపంచకప్ కోసం ఓ రోడ్మ్యాప్ను సిద్ధం చేశాం. ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతాం' అని అన్నారు.
రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ:
సమావేశం అనంతరం బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగే సిరీస్లకు జట్ల ఎంపిక జరిగింది. విరామం లేకుండా వరుస సిరీస్లు ఆడుతున్న విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలెక్షన్ కమిటీ.. రోహిత్ శర్మకు టీ20ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆల్రౌండర్ శివమ్ దూబే తొలిసారిగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. నాలుగేండ్ల తర్వాత జట్టులో యువ క్రికెటర్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. పొట్టి సిరీస్ నుంచి ఆల్రౌండర్ జడేజాకు విశ్రాంతినివ్వగా.. యుజువేంద్ర చాహల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. టీ20లలో మార్పులు చేసినా.. టెస్టులకు మాత్రం సఫారీలను క్లీన్స్వీప్ చేసిన జట్టునే ఎంపిక చేశారు.