Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి డే/నైట్‌ టెస్ట్‌.. ఈడెన్‌లో గంట మోగించనున్న హసీనా, మమత!!

India vs Bangladesh: Sheikh Hasina, Mamata Banerjee to watch Day-Night Test from Presidents Box

ఢిల్లీ: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా మరో సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. అనంతరం ఈ నెల 22-26 మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌ జరగనుంది.

ముఖ్య అతిధిగా బంగ్లా ప్రధాని:

ముఖ్య అతిధిగా బంగ్లా ప్రధాని:

భారత్‌-బంగ్లాదేశ్‌ తొలిసారి డే/నైట్‌ టెస్ట్‌ ఆడనుండంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈడెన్‌లో జరిగే చారిత్రక ఘట్టాన్ని మరింత అపురూపంగా మలచడానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్‌) కృషి చేస్తోంది. చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

గంట మోగించనున్న హసీనా, మమత:

గంట మోగించనున్న హసీనా, మమత:

ఈ నెల 22న ప్రారంభమయ్యే టెస్ట్‌ను హసీనా, మమతలు సంయుక్తంగా గంట మోగించి ప్రారంభించనున్నారు. మరోవైపు బంగ్లా ప్రతినిధుల బృందం మంగళవారం స్టేడియంలో పర్యటించి ప్రధాని భద్రతపై దృష్టి సారించారు. ఈడెన్‌లోని ప్రెసిడెంట్స్‌ బాక్స్‌ నుంచి హసీనా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఇక మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లను ప్రధాని సత్కరించనున్నారు.

మోడీకి క్యాబ్‌ ఆహ్వానం:

మోడీకి క్యాబ్‌ ఆహ్వానం:

డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు రావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి క్యాబ్‌ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధాని వస్తారని కచ్చితమైన సమాచారం లేకున్నా.. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా వస్తున్నారు కాబట్టి ఆమెను కలిసేందుకు మోడీ కూడా రానున్నారు. ఇక విరామ సమయంలో దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, సచిన్‌ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో చాట్‌ షోల నిర్వహణకు క్యాబ్‌ ప్లాన్‌ చేస్తోంది.

 భారత్‌పై ఒక్క విజయం లేదు:

భారత్‌పై ఒక్క విజయం లేదు:

2000లో టెస్టు హోదా పొంది భారత్‌తోనే ఢాకాలో తొలి టెస్టు ఆడింది బంగ్లాదేశ్‌. అయితే ఇప్పటివరకు భారత్‌పై బంగ్లా మాత్రం విజయం సాధించలేదు. గత 19 ఏళ్లలో ఇరు జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. 7 టెస్టుల్లో భారత్‌ నెగ్గగా.. రెండు టెస్టులు డ్రా అయ్యాయి. 2017 ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వేదికగా టీమిండియాతో బంగ్లాదేశ్‌ చివరిసారిగా టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 208 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.

19 ఏళ్లలో మొత్తం 115 టెస్టులు:

19 ఏళ్లలో మొత్తం 115 టెస్టులు:

మొత్తంగా బంగ్లాదేశ్‌ గత 19 ఏళ్లలో మొత్తం 115 టెస్టులు ఆడింది. ఇందులో 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఏకంగా 86 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక 16 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మష్రఫె ముర్తజా, షకీబ్‌, తమీమ్‌ లేకపోవడంతో ఒత్తిడిలో ఉన్న బంగ్లా.. ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

Story first published: Wednesday, November 13, 2019, 10:44 [IST]
Other articles published on Nov 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+