
కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో
శుక్రవారం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. సెషన్ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకే భారత నెట్ బౌలర్ నువాన్ సెనెవిరత్నే వేసిన బంతి రోహిత్ శర్మ కాలికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన రోహిత్.. చేతి గ్లోవ్స్ తీసి ప్రాక్టీస్ నుండి బయటకి వెళ్ళిపోయాడు.

రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా
విక్రమ్ రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా రోహిత్ మైదానంలో ఉండలేదు. ఆ తర్వాత మళ్లీ ప్రాక్టిస్కు రాకపోవడంతో తొలి టీ20కి రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదోనని సందేహాలు వెల్లువెత్తాయి. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

రోహిత్శర్మ ఎడమ తొడకు గాయం
"నెట్స్లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా రోహిత్శర్మ ఎడమ తొడకు గాయమైంది. పరీక్షించించిన వైద్యసిబ్బంది రోహిత్ ఫిట్గా ఉన్నాడని ధృవీకరించింది. తొలి టీ20కు అతడు అందుబాటులో ఉంటాడు" బీసీసీఐ పేర్కొంది. భారత పర్యటనలో బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.

ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి టీ20
ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. గత కొంత కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.


Click it and Unblock the Notifications












