టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా బ్యాట్స్మెన్కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. భారత బౌలర్ల ధాటికి 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం(6), ఇమ్రుల్ కయాస్(6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆరో ఓవర్లో ఇమ్రుల్ కైస్(6) ఉమేశ్ బౌలింగ్లో స్లిప్లో రహానె చేతికి చిక్కాడు.
లంచ్ విరామానికి 63/3
మొహమ్మద్ మిథున్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ నిర్ణీత 26 ఓవర్లలో3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. లంచ్ విరామం అనంతరం టీమిండియా పేసర్ మహ్మద్ షమి వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.
ముష్ఫికర్ రహీమ్ క్లీన్బౌల్డ్
షమి వేసిన 54వ ఓవర్ ఐదో బంతికి తొలుత ముష్ఫికర్ రహీమ్(43) క్లీన్బౌల్డ్ కాగా, తర్వాతి బంతికే మెహెది హసన్(0) ఎల్బీగా వెనుదిరిగాడు. టీ విరామం అనంతరం ఇషాంత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే లిటాన్ దాస్(21) ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోరు 140 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడు వికెట్లను కోల్పోవడం విశేషం.
140/5 నుండి 150కే ఆలౌట్
అనంతరం తైజుల్ ఇస్లామ్ రనౌట్ కాగా, చివరి వికెట్గా ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఇబాదత్ హుస్సేన్(2) ఔటయ్యాడు. ఈ రోజు ఆటలో లంచ్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. టీ విరామానికి మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. 140/5 స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ చివరి ఐదు వికెట్లను 10 పరుగుల తేడాతో కోల్పోయి 150 పరుగులకే ఆలౌటైంది.