
ఎర్ర బంతితో పోలిస్తే
"ఎర్ర బంతితో పోలిస్తే పింక్ బాల్కు చాలా తేడా కనిపించింది. ఆరంభంలో సరైన లెంగ్త్లో బౌలింగ్ చేశాం కానీ బంతి మాత్రం స్వింగ్ కాలేదు. అప్పుడు మేమందరం చర్చించుకున్న తర్వాత పింక్ బాల్తో ఎలాంటి లెంగ్త్తో బౌలింగ్ చేయాలనేది అర్థమైంది. పరిమిత ఓవర్ల జట్టుకు దూరమయ్యాననే బెంగ ఏమాత్రం లేని దశకు చేరుకున్నాను" అని ఇషాంత్ అన్నాడు.

ఏ ఫార్మాట్ అయినా ఆడాలని
ఏ ఫార్మాట్ అయినా ఆడాలని, ఆటను ఆస్వాదించాలని మాత్రమే కోరుకుంటానని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. తొలి డే నైట్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59 బ్యాటింగ్; 8 ఫోర్లు), రహానే (23; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

68 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
భారత్కు ఇప్పటికే 68 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా, పుజారా(105 బంతుల్లో 55; 8 ఫోర్లు)తో కలిసి విరాట్ కోహ్లీ మూడో వికెట్కు 94 పరుగులు జోడించడం విశేషం. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ భారత బౌలర్ల దెబ్బకు 30.3 ఓవర్లలోనే 106 పరుగులకు కుప్పకూలింది.

నలుగురు బ్యాట్స్మన్ డకౌట్
షాద్మన్ ఇస్లామ్ (29), లిటన్ దాస్ (24 రిటైర్డ్ హర్ట్), నయీమ్ హసన్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా వారంతా నిరాశపరిచారు. నలుగురు బ్యాట్స్మన్ డకౌట్ కావడం విశేషం. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ 22 పరుగులకే 5 వికెట్లు పడగొట్టగా... ఉమేశ్కు 3, షమీకి 2 వికెట్లు దక్కాయి.


Click it and Unblock the Notifications
