For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: బంగ్లా బోర్డుతో వివాదం.. భారత పర్యటనకు షకీబ్‌ దూరం?!!

India vs Bangladesh 2019 : Shakib Al Hasan Likely To Miss India Tour || Oneindia Telugu
India vs Bangladesh: Bangladesh captain Shakib Al Hasan set to miss India tour

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌, కెప్టెన్ షకీబ్‌ అల్‌ హసన్‌ భారత పర్యటనకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. బంగ్లా బోర్డుతో ఇటీవల చెలరేగిన వివాదాల కారణంగా షకీబ్‌ భారత పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తిగా లేడని సమాచారం తెలుస్తోంది. భారత్‌తో సిరీస్‌లో భాగంగా జరిగిన సన్నాహాల్లో బంగ్లాదేశ్‌ జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్‌ సెషన్లలో పాల్గొనగా.. షకీబ్ ఒక ప్రాక్టీస్‌ సెషన్‌కు మాత్రమే హాజరయ్యాడు. మరో మూడు ప్రాక్టీస్‌ సెషన్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యాడు.

 షకీబ్ లేకుండా టీ20 జట్టు

షకీబ్ లేకుండా టీ20 జట్టు

బుధవారం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ యాజమాన్యం షకీబ్ లేకుండా తాజా టీ20 జట్టును ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. 'మంగళవారం టీ20 జట్టును ప్రకటిస్తాం. టెస్ట్ జట్టును ప్రకటించడానికి మాత్రం కొంత సమయం కావాలి. రెండు మూడు రోజుల తరువాత టెస్ట్ జట్టును ప్రకటిస్తాం' అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో తెలిపాడు.

 కీలక సమావేశంకు షకీబ్ డుమ్మా

కీలక సమావేశంకు షకీబ్ డుమ్మా

భారత పర్యటనకు ముందు వ్యూహాలను చర్చించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షకీబ్ పాల్గొనలేదు. కీలక ప్రాక్టీస్‌ సెషన్‌, సమావేశంకు షకీబ్ డుమ్మా కొట్టడంతో బీసీబీ అతనిపై గుర్రుగా ఉన్నట్లు బంగ్లా బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రంలోగా బీసీబీ టీ20 జట్టును ప్రకటించనుంది. మరి షకీబ్ జట్టులో ఉంటాడో లేదో చూడాలి.

షోకాజ్‌ నోటీసు

షోకాజ్‌ నోటీసు

తొలుత కాంట్రాక్ట్‌ విషయంలో సహచరులతో కలిసి సమ్మెకు నాయకత్వం వహించిన షకీబ్‌.. ఆ తర్వాత తన వ్యక్తిగత స్పాన్సర్‌ ఒప్పందం విషయంలో కూడా బోర్డుతో తలపడాల్సి వచ్చింది. టెలికామ్‌ సంస్థ రోబీ బంగ్లా జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉండగా.. ప్రత్యర్థి అయిన గ్రామీన్‌ఫోన్‌కు షకీబ్‌ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై బోర్డు షోకాజ్‌ నోటీసు జారీ చేయగా.. షకీబ్‌ ఇప్పటి వరకు స్పందించలేదు.

కావాలనే వివాదాలు

కావాలనే వివాదాలు

షకీబ్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు కావాలనే వివాదాలు చేస్తూ.. జట్టును దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమైన ఆటగాళ్లు కూడా చివరి నిమిషంలో తప్పుకునే ప్రమాదం ఉన్నట్లు తనకు అనిపిస్తోందన్న హసన్‌ పేర్కొన్నారు. షకీబ్‌ పేరును ఆయన ప్రత్యేకంగా చెప్పారు. దీంతో భారత పర్యటనకు షకీబ్‌ దాదాపు దూరం అయినట్టే.

Story first published: Tuesday, October 29, 2019, 12:17 [IST]
Other articles published on Oct 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+