
ఐఎండీ డైరెక్టర్ జయంత్ సర్కార్ మాట్లాడుతూ
ఈ తుఫాన్పై ఐఎండీ డైరెక్టర్ జయంత్ సర్కార్ మాట్లాడుతూ "డయ్యుకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో 580 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన తుఫానుగా మారి ద్వారకా లేదా డయ్యు మధ్య బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటనుంది" అని అన్నారు.
హర్షా భోగ్లే కూడా
ఈ తుఫాన్పై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ట్విట్టర్లో స్పందించారు. "రాజ్కోట్లో టీ20కి ముందు పశ్చిమ తీరంలో అల్పపీడనం ఏర్పడిందని తుపాను వార్తలు వస్తున్నాయి. సౌరాష్ట్ర తీరంలో నవంబర్ 6, 7న మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుపాను మరీ ప్రమాదకరం కావొద్దని, అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలగొద్దని కోరుకుంటున్నాను. ఈ ఏడాది వాతావరణం ఊహించని విధంగా ఉంటోంది" అని భోగ్లే ట్వీట్ చేశారు.

రెండో టీ20 రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు
అయితే, మ్యాచ్కి ముందు గనుక గుజరాత్లో భారీ వర్షాలు కురిస్తే రెండో టీ20 రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

సిరీస్ను 1-1తో సమం చేయాలని
దీంతో మూడు టీ20ల సిరిస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.


Click it and Unblock the Notifications
