హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు త్వరలో భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరిస్ ఆడనుంది. రెండు టీ20ల్లో మొదటి టీ20 విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 24న జరగనుంది.
పంత్ను వరల్డ్కప్లో ఆడించాల్సిందే: వార్న్ వ్యాఖ్యలను సమర్ధించిన సన్నీ
ఇందులో భాగంగా తొలి టీ20కి సంబంధించిన మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు ఆఫ్లైన్లో చేపడుతున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ తెలిపారు. శుక్రవారం నుంచి నగరంలో ఎనిమిది కేంద్రాల్లో టిక్కెట్లు లభ్యమవుతాయని ఆయన చెప్పారు. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
టికెట్లు లభించే కేంద్రాలు:
ఏసీఏ వీడీసీఏ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, బీచ్రోడ్డు పాండురంగపురంలోని గ్లట్టన్స్ గ్యారేజ్, సిరిపురం రోడ్డులోని ఫ్రెష్ చాయిస్ బేకరీ, ఆశీల్మెట్ట వద్ద నున్న డ్రంకన్ మంకీ, 4సీజన్స్ బేకరీ, గాజువాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద గల 4సీజన్స్ బేకరీ, డాబాగార్డెన్స్లోని హోటల్ లెజెండ్ గ్రాండ్.