హెడెన్ మాట్లాడుతూ
మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇటీవల ఆసీస్ పర్యటనలో కోహ్లీని మూడు సార్లు ఔట్ చేసిన యువ ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్కి ఈసారి అంత సులువుగా వికెట్ దక్కబోదని మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. "ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్లో రిచర్డ్సన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కాస్త తడబడ్డాడు. ఆఫ్ స్టంప్కి వెలుపలగా పడిన బంతుల్ని వెంటాడే ప్రయత్నంలో మూడుసార్లు వికెట్ చేజార్చుకున్నాడు. అయితే, భారత్లో పరిస్థితులు వేరులా ఉంటాయి. మరోవైపు రిచర్డ్సన్ ఇంకా యువకుడు.. అతనికి తగినంత క్రికెట్ అనుభవం లేదు" అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ ఆధిపత్యం కనబరుస్తాడు
"విరాట్ కోహ్లీ కచ్చితంగా ఈసిరీస్లో పూర్తిస్థాయిలో ఆధిపత్యం కనబరుస్తాడు. ఇటీవల కోహ్లీ ఫామ్ను చూస్తుంటే.. రిచర్డ్సన్కే కాదు.. ఆస్ట్రేలియా బౌలర్లందరికీ చిక్కులు తప్పేలాలేవు" అని హెడెన్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరిస్ కావడంతో ఈ సిరిస్లో టీమిండియా ప్రయోగాల బాట పట్టేలా కనిపిస్తోంది.
ఫిబ్రవరి 24న విశాఖ వేదికగా తొలి టీ20
ఇప్పటికే ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్కు సెలక్టర్లు జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రెండ్రోజుల ప్రాక్టీస్ అనంతరం 22న విశాఖపట్నం బయల్దేరుతారు. మార్చి 2న హైదరాబాద్లో తొలి వన్డే జరగనుంది.