ప్రస్తుతం 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ జట్టు ప్రస్తుతం 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 102 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు ఐదో స్థానంలో ఉంది. గురువారం నుంచి జరగనున్న నాలుగు టెస్టు సిరీస్లో ఒకవేళ ఆస్ట్రేలియా 4-0తో విజయం సాధిస్తే? అప్పుడు ఆస్ట్రేలియా 110 పాయింట్లకి చేరుకోగా.. భారత్ 108 పాయింట్లకి పడిపోతుంది.
4-0తో గెలిస్తే భారత్ ఖాతాలో 120 పాయింట్లు
అదే టీమిండియా టెస్టు సిరిస్ను 4-0తో గెలిస్తే భారత్ ఖాతాలో 120 పాయింట్లు వచ్చి చేరుతాయి. మరోవైపు ఆసీస్ 97 పాయింట్లకి దిగజారుతుంది. అలా కాకుండా ఆస్ట్రేలియా సిరీస్ని 3-0తో గెలిస్తే, అప్పుడు భారత్ 109, ఆస్ట్రేలియా 108 పాయింట్లతో నిలుస్తుంది. దీంతో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
2014-15లో చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై
2014-15లో చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్లో 0-2తో చేజార్చుకుంది. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలతో చెలరేగడంతో పాటు 692 పరుగులు చేశాడు. అయితే, జట్టు సభ్యుల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో ఒక్క మ్యాచ్లో కూడా టీమిండియా గెలవలేకపోయింది.
ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరిస్ను గెలవని భారత్
గత నలభై ఏళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నా... టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరిస్ను గెలవలేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్టు సిరీస్ని ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో కోహ్లీసేన ఉంది. దీనికి తోడు ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్మిత్, వార్నర్ లేకపోవడంతో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.