టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచేందుకు రోహిత్ శర్మ ఇంకో 65 పరుగులు చేయాల్సి ఉండగా.. విరాట్ కోహ్లి 170 పరుగుల దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్లో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
అగ్రస్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ (2271)అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 75 మ్యాచ్ల్లో గుప్తిల్ ఈ స్కోరుని సాధించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 87 మ్యాచ్ల్లో 2,207 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
మూడో స్థానంలో షోయబ్ మాలిక్
పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ 108 మ్యాచ్ల్లో 2,190 పరుగులతో మూడో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ 71 మ్యాచ్ల్లో 2,140 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈజాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 2,102 పరుగులతో ఉన్నాడు.
టాప్-5 కోహ్లీ యావరేజే ఎక్కువ
కోహ్లీ 62 మ్యాచ్ల్లోనే ఈ స్కోరు సాధించాడు. కాగా, టాప్-5లో అందరి కంటే ఎక్కువ యావరేజి(48.88)తో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. టాప్-2లో ఉన్న రోహిత్ శర్మ యావరేజి 33.43గా ఉంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నారు.