ధోని లేకుండా రాంచీలో తొలి టెస్టు
రాంచీలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడకపోవడం అభిమానులకు వెలితిగా ఉంది. తొలిసారి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాంచీ మైదానంలో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టుపై దృష్టి సారించాడు. బ్యాటింగ్ ప్రాక్టీసుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.
మూడో టెస్టు కోసం ఐదో నెంబర్ పిచ్
ప్రాక్టీస్కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ను పరిశీలించారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు కోసం మొత్తం నాలుగు పిచ్లను సిద్ధం చేసినట్లు క్యూరేటర్ ఎస్బీ సింగ్ తెలిపారు. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్టు కోసం నెంబరు ఐదో పిచ్ను ఎంపిక చేశారు.
పిచ్ని పరిశీలించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్
పిచ్ను పరిశీలించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ మాట్లాడుతూ రాంచీ పిచ్ను పరిశీలించామని, మూడో టెస్టు విజయం కోసం ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఐదు రోజులు జరిగితే బాగుంటుంది
పిచ్ గురించి జేఎస్సీఏ సెక్రటరీ మాట్లాడుతూ గత రెండు టెస్టు మ్యాచ్ల్లో ఐదు రోజులకు బదులు నాలుగు రోజుల్లోనే ఫలితం తేలిందని.. రాంచీ పిచ్లో ఐదు రోజు వరకూ ఫలితం కోసం వేచి ఉండాల్సి ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications