25 బంతుల్లో 11 పరుగులు:
రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 233/6 స్కోరుతో ఆటను ఆరంభించిన టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయింది. 23 నిమిషాలే క్రీజులో ఉన్న భారత బ్యాట్స్మెన్.. 25 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టారు. పాట్ కమిన్స్ తొలి ఓవర్లోనే రవిచంద్రన్ అశ్విన్ (15)ను ఔట్ చేయగా.. ఆ తర్వాతి ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా (9)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్కు పంపాడు. ఆపై బ్యాటింగ్కు వచ్చిన ఉమేశ్ యాదవ్ (6), మొహ్మద్ షమీ (0) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా (4) నాటౌట్గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ (4/53), కమిన్స్ (3/48) రాణించారు.
లబుషేన్ క్లాస్:
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను జస్ప్రీత్ బుమ్రా ఆదిలోనే కోలుకొని దెబ్బతీశాడు. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (8), రోరీ బర్న్స్ (8)ను ఔట్ చేశాడు. దీంతో లంచ్ విరామానికి ఆసీస్ 35/2తో నిలిచింది. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ (1)ను ఆర్ అశ్విన్ తన తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ (7), కెమెరన్ గ్రీన్ (11)ను కూడా అశ్విన్ పెవిలియన్కు పంపించి ఆసీస్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పైన్తో కలిసి లబుషేన్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూనే పరుగులు సాధించారు. లబుషేన్ నెమ్మదిగా ఆడినా.. పైన్ కాస్త ధాటిగా ఆడాడు. లబుషేన్కు మూడు జీవనాధారాలు లభించాయి.
పైన్ పట్టుదల:
అర్ధశతకం దిశగా సాగుతున్న లబుషేన్ను ఉమేశ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో కమిన్స్ను కూడా ఉమేశ్ ఔట్ చేయడంతో ఆసీస్ 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పైన్ పట్టుదలతో ఆడుతూ పరుగులు సాధించాడు. టెయిలెండర్లతో కలిసి బౌండరీలతో భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 72.1 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/55) తన మాయాజాలాన్ని ప్రదర్శించి కంగారూల పతనాన్ని శాసించాడు.
భారత్ ఆధిక్యం 62:
తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 191 పరుగులకే పరిమితం చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (4) మళ్లీ తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. పాట్ కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వన్డౌన్లో బుమ్రా నైట్ వాచ్మన్గా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (5), బుమ్రా (0) క్రీజులో ఉన్నారు. భారత్ 62 ఆధిక్యంలో కొనసాగుతోంది.