11 మంది మౌల్వీలతో షమీ తండ్రి ప్రార్థనలు, కరెంట్ లేక మ్యాచ్ చూల్లేదు
సిడ్నీ: మొహమ్మద్ షమీ కుటుంబ సభ్యులు భారత్ - ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పవర్ కష్టాలు వచ్చాయి. అంతకుముందు సెమీ ఫైనల్లో భారత్ గెలుపు కోసం షమీ ఇంట్లో ఖురాన్ పఠనం చేశారు. పదకొండు మంది మౌల్వీలతో సాహస్ పూర్ - అలీ నగర్లో ఇందుకోసం ప్రత్యేకంగా పఠనం చేశారు. గ్రామంలో ఉన్న నాలుగు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు.
ఈ సందర్భంగా ఓ మౌల్వీ మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రార్థనలు కేవలం షమీ కోసం చేయలేదని, భారత జట్టు కోసం చేశామన్నారు. తాము తమతో పాటు ఊర్లో వారంతా ఒకచోట చేరి ప్రత్యేక కార్యక్రమం నిర్మించామన్నారు. ఆ దేవుడి దయతో ఆటగాళ్లు ప్రత్యర్థికి సరైన సమాధానం చెప్పాలన్నారు. పదకొండు మంది భారత ప్లేయర్ల కోసం పదకొండు మంది మౌల్వీలతో ఖురాన్ పఠనం చేయించినట్లు షమీ తండ్రి తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఖురాన్ పఠనం చేయించిన షమి కుటుంబ సభ్యులు మ్యాచ్ చేసేందుకు మాత్రం విద్యుత్ లేకుండా పోయింది. షమి తండ్రి గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్ లేని కారణంగా తాము మ్యాచ్ చూడలేకపోయామని చెప్పారు. విద్యుత్ సమస్య చాలా ఉందని, కరెంట్ పోతే మళ్లీ ఎనిమిది తొమ్మిది గంటలకు వస్తుందని ఆయన చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications