
హైదరాబాద్: పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి క్రీజులో పాతుకుని భారీ స్కోరు దిశగా సాగుతున్న ఓపెనర్ మార్కస్ హ్యారిస్(70, 141 బంతుల్లో 10 ఫోర్లు)ను ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి పెవిలియన్కు పంపాడు.
ఇన్నింగ్స్ 49 ఓవర్లో హనుమ విహారి వేసిన రెండో బంతిని అమాంతం గాల్లోకి లేపడంతో అక్కడే ఉన్న రహానే దానిని చక్కటి క్యాచ్గా అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో పార్ట్ టైమ్ స్పిన్నర్గా బౌలింగ్ వేసే హనుమ విహారికి అంతర్జాతీయ క్రికెట్లో ఇది నాలుగో వికెట్ కావడం విశేషం. అడిలైడ్ టెస్టులో రోహిత్ శర్మ గాయపడటంతో.. అతని స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
{photo-feature}