|
హాఫ్ సెంచరీ సాధించిన కమ్మిన్స్
ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్లు కలిపి కమ్మిన్స్ 9 వికెట్లు తీసిన కమ్మిన్స్ బ్యాట్తోనూ మెరుపులు మెరిపించాడు. మొత్తం 103 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించిన కమ్మిన్స్ (61 బ్యాటింగ్) భారత్ విజయాన్ని ఐదో రోజుకు వాయిదా వేశాడు. అతనికి నాథన్ లియాన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
|
భారత్ గెలుపు లాంఛనమే
అయితే ఆ జట్టు విజయానికి ఇంకా 141 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆదివారం భారత్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. భారత బౌలర్లలో జడేజా మూడు, షమీ 2, బుమ్రా 2 వికెట్లు తీయగా ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు.
|
106/8 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన భారత్
ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 54/5తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. శనివారం తొలి సెషన్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (42), రిషబ్ పంత్ (33) ఫరవాలేదనిపించారు.
|
ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ
టీమిండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. ఈ టెస్టు సిరిస్లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఓపెనర్ ఆరోన్ ఫించ్(3) మరోసారి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అనంతరం మరో ఓపెనర్ హారిస్ (13) స్పిన్నర్ జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు.
|
33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి ఆసీస్
దీంతో జట్టు స్కోరు 33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (33) కూడా మహ్మద్ షమీ బౌలింగ్లో జట్టు స్కోరు 63 వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్(44), ట్రావిస్ హెడ్(34), మిచెల్ మార్ష్(10), టిమ్ పైనీ(26), మిచెల్ స్టార్క్(18) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు. చివర్లో స్టార్క్ (18), లయన్(6 నాటౌట్)లతో కలిసి కమిన్స్ 82 పరుగులు జోడించాడు.