
పగటి పూట ఇలా అవసర్లేదు
గతంలో ఇక్కడ మూడు డే అండ్ నైట్ టెస్టులు జరిగాయి. ఈ తరహా మ్యాచ్ల్లో గులాబీ బంతి దెబ్బతినకుండా పిచ్పై అదనపు పచ్చిక పొరను అలాగే ఉంచడం సహజంగా జరిగేది. అయితే భారత్ ఫ్లడ్లైట్ల వెలుతురులో టెస్టు ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ టెస్టు డే మ్యాచ్గానే జరుగుతుంది. కానీ ఎరుపు బంతితో జరిగే ఈ మ్యాచ్కు కూడా క్యురేటర్ పిచ్ను అలాగే ఉంచాలని భావిస్తున్నాడు. ఎరుపు బంతితో ఆడే పగటి పూట టెస్టుకు ఇలా అవసరం లేదు.

చక్కటి సమన్వయం ఉండాలంటే
‘గతానికి భిన్నంగా ఏమీ చేయడం లేదు. ఎప్పటిలాగే సన్నద్ధం చేస్తున్నాం. కవర్లు ముందుగా తొలగించి ఆటను ముందుగా ఆరంభించడమే ప్రస్తుత మార్పు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీల్లో ఎర్ర, గులాబీ బంతులతో ఆడే మ్యాచ్లకు ఇలాగే సిద్ధం చేస్తాం. బ్యాట్కు బంతికి మధ్య చక్కటి సమన్వయం ఉండాలంటే పిచ్పై ఇలా పచ్చిక ఉంచడమే కరెక్ట్' అని పిచ్ క్యూరేటర్ డేమియన్ హఫ్ పేర్కొన్నారు.

సీమర్లకు పిచ్ అనుకూలించే అంశం
రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటించే ప్రతి జట్టు అడిలైడ్లో గులాబి బంతితో డే/నైట్ టెస్టు ఆడుతున్నాయి. కోహ్లీసేనను సైతం గులాబి బంతితో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరగా బీసీసీఐ తిరస్కరించింది పిచ్పై తొలి డే/నైట్ టెస్టు మూడు రోజుల్లో, రెండోది నాలుగు రోజుల్లో, మూడోది ఐదో రోజు తొలి సెషన్లో ముగిశాయి. పిచ్పై పచ్చిక అదనంగా ఉంటే ఇరు జట్ల సీమర్లకు ఈ పిచ్ అనుకూలించే అవకాశం ఉంది. ఆసీస్లో పొడగరి, బలమైన పేసర్లు ఉంటారన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications

