|
19 బంతుల్లోనే 45 పరుగులు:
ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 13 మ్యాచ్లు ఆడి ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా తీవ్రంగా నిరాశపర్చిన గ్లెన్ మాక్స్వెల్.. తొలి వన్డేలో 3 సిక్సులు బాది ఆశ్చర్యపరిచాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు చేసిన మాక్స్వెల్పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 2020లో పంజాబ్ తరఫునే ఆడిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ సైతం నిరాశపర్చాడు. కానీ శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన టీ20 మ్యాచ్లో 24 బంతుల్లో 48 రన్స్ చేసి ఔరా అనిపించాడు.
|
రాహుల్ ఇలా చూస్తున్నాడు:
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. మాక్స్వెల్పై ఎంతో నమ్మకం ఉంచి 13 మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చాడు. అతడు మాత్రం 108 రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ మాక్స్వెల్, నీషమ్లను ట్రోల్ చేస్తున్నారు. 'నీషమ్, మాక్స్వెల్ తమ జాతీయ జట్ల తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతుంటే.. కేఎల్ రాహుల్ ఇలా చూస్తున్నాడు' అంటూ మార్ఫింగ్ చేసిన రాహుల్ ఫొటోను వరుణ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు. అంతేకాదు నీషమ్ను ట్యాగ్ చేశాడు. ఆ ఫొటోను చూసి నీషమ్.. అది నిజమే అంటూ మ్యాక్స్వెల్ను ట్యాగ్ చేశాడు.
సారీ చెప్పా:
జిమ్మీ నీషమ్ ట్వీట్కు స్పందించిన గ్లెన్ మాక్స్వెల్.. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్కు సారీ చెప్పానని నవ్వుతూ కామెంట్ చేశాడు. మాక్స్వెల్ తన ట్వీట్కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రెండ్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ కూడా తమదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్ 2020లో అదరగొట్టిన రాహుల్.. తొలి వన్డేలో మాత్రం విఫలమయ్యాడు. 15 బంతుల్లో 12 రన్స్ మాత్రమే చేశాడు.