For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టులో ఆధిక్యం లభించినా టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు

India vs Australia: Fewest runs added by indias middle order in an innings

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌ను 443/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో పుజారా(106) సెంచరీ సాధించగా విరాట్ కోహ్లీ(82), మయాంక్ అగర్వాల్(76) రోహిత్ శర్మ(63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆతిథ్య జట్టుని 151 పరుగులకే భారత బౌలర్లు ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.

 ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా

ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా

అయితే, ఆతిథ్య జట్టుని ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా.. టీమండియా అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. చివ‌రి రోజు బ్యాటింగ్ క‌ష్ట‌మ‌వుతుంద‌నే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది. అయితే, రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ స్వల్ప వ్యవధిలోనే టాప్ ఆర్డర్‌ను చేజార్చుకుంది.

ముగిసిన మూడో రోజు: భారత్ 54/5

ముగిసిన మూడో రోజు: భారత్ 54/5

దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 54 పరుగులు చేసింది. ప్ర‌స్తుతానికి భార‌త్ 346 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో ప్రస్తుతం క్రీజులో మ‌యాంక్‌ అగర్వాల్ (28), రిషబ్ పంత్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టులో పుజారా, కోహ్లీ డకౌట్ కాగా రహానే(1), రోహిత్ శర్మ(5) వెనువెంటనే పెవిలియన్ చేరారు.

మూడు నుంచి ఆరు స్థానాల్లో

మూడు నుంచి ఆరు స్థానాల్లో

ఒక ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌లో మూడు నుంచి ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వచ్చిన ఆటగాళ్లు అందరూ కలిసి కేవలం 6 పరుగులు మాత్రమే జోడించారు. 1983 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంత ఘోరంగా విఫలమవడం ఇదే తొలిసారి. 1983లో అహ్మదాబాద్‌లో విండీస్‌తో టెస్టులో నలుగురు మిడిలార్డర్ ఆటగాళ్లు 9 పరుగులు రాబట్టారు.

హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టులో సైతం

హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టులో సైతం

1969లో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సైతం ఇవే గణాంకాలు నమోదు చేశారు. అంతకముందు 1946లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్పంగా భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేవలం 6 పరుగులు జోడించడం విశేషం.

1
43625
Story first published: Friday, December 28, 2018, 19:29 [IST]
Other articles published on Dec 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+