ఈ ఫోన్ ఎవరిది అంటూ కాల్ లిఫ్ట్ చేసిన పైన్
దీంతో ఈ ఫోన్ ఎవరిది అంటూ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. దీంతో టిమ్ పైన్ మాట్లాడుతూ మీకు ఎవరు కావాలి అంటూ అడిగాడు. దానికి అవతలి వ్యక్తి తన పేరు కేసీ అని, తనకు మార్టిన్ కావాలని అడిగింది. అతడు ప్రెస్మీట్లో మధ్యలో ఉన్నాడని, తర్వాత అతనితో కాల్ చేయిస్తానని పేన్ చెప్పాడు.
|
ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ఇలా
ఒక్కసారి అతన్ని మెయిల్ చెక్ చేసుకోమని కేసీ చెప్పడంతో అలాగే అంటూ టిమ్ పైన్ ఫోన్ పెట్టేశాడు. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ఓ జర్నలిస్ట్కు వచ్చిన ఫోన్ కాల్ లిప్ట్ చేసి టిమ్ పైన్ మాట్లాడటం చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
|
భారత్ 622/7 డిక్లేర్డ్
కాగా, సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్), జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్కు 4 వికెట్లు దక్కాయి. హాజెల్వుడ్ 2, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
|
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 24/0
అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్కు దిగింది. రెండో రోజు కేవలం పది ఓవర్లు మాత్రమే ఆసీస్ బ్యాటింగ్ చేసింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పది ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్లు హారిస్ (19 బ్యాటింగ్), ఖవాజా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.