హైదరాబాద్: ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లు శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఆసీస్ పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఆటగాళ్లు అరోన్ ఫించ్, కౌల్టర్ నైల్, జేమ్స్ ఫల్కనర్, ట్రావిస్ హెడ్, స్టోనిస్, ఆడమ్ జంపా, రిచర్డ్ సన్లు ముందుగా భారత్కు చేరుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లతో కూడిన మరికొంత మంది జట్ట సభ్యులు శనివారం సాయంత్రానికి భారత్కు వచ్చే అవకాశం ఉంది.

భారత్ పర్యటనకు ప్రకటించిన ఆసీస్ జట్టులో తొలుత రిచర్డ్సన్ పేరు లేదు. పేసర్ జోష్ హాజెల్ఉడ్ స్ధానంలో అతడు చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం వీరు బంగ్లాదేశ్లో ఉన్నారు. బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఆస్ట్రేలియా 1-1తో సమం చేసుకుంది. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా జట్టులోని పలువురి ఆటగాళ్లు భారత్కు రానున్నారు.
కాగా, ఇరు జట్ల మధ్య తొలి వన్డే సెప్టెంబర్ 17న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు సెప్టెంబర్ 12న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో ఆస్ట్రేలియా జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు:
Steve Smith (C), David Warner, Ashton Agar, Hilton Cartwright, Nathan Coulter-Nile, Patrick Cummins, James Faulkner, Aaron Finch, Travis Head, Glenn Maxwell, Marcus Stoinis, Matthew Wade (WK), Adam Zampa and Kane Richardson.