కోహ్లీని ఔట్ చేయాలని ఉందన్న ఆర్చీ షిల్లర్
షేన్వార్న్ను ఆదర్శంగా తీసుకొని కెరీర్ను ప్రారంభించిన లెగ్స్పిన్నర్ ఆర్చీ షిల్లర్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పాడు. దుబాయి వేదికగా పాకిస్థాన్తో ఆస్ట్రేలియా రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడుతున్న క్రమంలో ఆర్చీ షిల్లర్కి హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ నుంచి నేరుగా కాల్ చేశాడు.
|
వీడియో కాల్ ద్వారా జట్టులోకి
వీడియో కాల్ ద్వారా తనను ఆస్ట్రేలియా టెస్టు జట్టులోకి ఎంపిక చేసినట్లు ఆర్చీ షిల్లర్ పేర్కొన్నాడు. ఆసీస్ జట్టుతో కలవగానే ఆస్ట్రేలియా జెర్సీని అతనికి అందజేశారు. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లతో కలిసి ఆర్చీ షిల్లర్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్లో పంచుకుంది.
|
క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్లో ట్వీట్
ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికైన ఆర్చీ షిల్లర్ అడిలైడ్ ఓవల్ మైదానంలో ఆటగాళ్లతో కలిసి ఫొటోకు పోజులిచ్చాడు. ఈ సందర్భంగా ఓ యువ ఆటగాడు జట్టులోకి వచ్చినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ తన ట్విటర్లో పేర్కొంది.
గత పర్యటనలో నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ
2014-15లో ఆసీస్ గడ్డపై చివరిసారిగా భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీ మొత్తం 8 ఇన్నింగ్స్ల్లో 692 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ సిరిస్లో స్టీవ్ స్మిత్(769) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అందరి కళ్లూ కోహ్లీపైనే
మళ్లీ మూడేళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడేందుకు వచ్చింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన రికార్డ్స్కి చేరువలో కోహ్లీ ఉన్నాడు. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. అందరి కళ్లూ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి.