సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్ అరుదైన రికార్డు
ఈ రికార్డుని టీమిండియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోనే సాధించడం విశేషం. గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా 622/7 వద్ద డిక్లేర్ చేయడంతో ఈ గ్రౌండ్లో అత్యధికంగా మూడు సార్లు 600కుపైగా పరుగులు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. ఈ గ్రౌండ్లో టీమిండియా అత్యధిక స్కోరు 705/7 డిక్లేర్డ్.
సిడ్నీలో భారత్ అత్యధిక స్కోరు 705/7 డిక్లేర్డ్
ఈ స్కోరుని 2003-04 పర్యటనలో చేసింది. అంతకముందు 1985-86 పర్యటనలో టీమిండియా చేసిన 600/4 డిక్లేర్డ్ మూడో స్థానంలో నిలిచింది. స్ట్రేలియా గడ్డపై టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఆసీస్తో జరుగుతోన్న నాలుగు టెస్టుల సిరీస్లో ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న భారత్.. ఆఖరి సిడ్నీ టెస్టులోనూ అద్భుతంగా ఆడుతోంది.
సిడ్నీలో సెంచరీలతో చెలరేగిన పంత్, పుజారా
తొలి ఇన్నింగ్స్లో ఛటేశ్వర్ పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు, రవీంద్ర జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు భారత్ బ్యాట్స్మన్ అంతా సమిష్టిగా రాణించారు.


Click it and Unblock the Notifications













