68 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేశారు: పుజారా డబుల్, సాహా సెంచరీ, చెమటోడుస్తున్న ఆసిస్
రాంచీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బ్యాట్సుమెన్ పుజారా - సహా టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. వీరిద్దరు ఓడో వికెట్కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.
135 చిలుకు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా 68 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టారు. 1948లో అడిలైడ్లో జరిగిన మ్యాచులో హేము అధికారి - విజయ్ హజారే ఏడో వికెట్కు 132 పరుగులు జోడించారు. ఇ రికార్డును పుజారా - సాహా బద్దలు కొట్టారు.
కాగా, పూజారా, సాహా జోడీని విడదీసేందుకు తమ అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నా ఆస్ట్రేలియాకు ప్రయోజనం దక్కలేదు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత మాత్రం లియోన్ బౌలింగులో మాక్స్వెల్ క్యాచ్ పట్టగా.. పుజారా అవుటయ్యాడు.

పుజారా డబుల్ సెంచరీ
రాంచీ టెస్టులో పుజారా డబుల్ సెంచరీ చేశాడు. ఇది అతనికి కెరీర్లో మూడో డబుల్. ఆస్ట్రేలియా పైన రెండో డబుల్ సెంచరీ. పుజారా 525 బంతుల్లో 202 పరుగులు చేశాడు. వృద్ధిమాన్ సాహా సెంచరీ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications