
హెచ్సీఏ విఫలం
అయితే అందుకు తగ్గట్టుగా మ్యాచ్ని జరిగేలే చేయడంలో హెచ్సీఏ విఫలమైంది. దీంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో హెచ్సీఏపై అసహనం వ్యక్తం చేశారు. ‘హెచ్సీఏ మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైంది. స్టేడియం నిర్వహకులు మ్యాచ్ను నిర్వహించడంలో విఫలమయ్యారు' అని ఓ నెటిజన్ అన్నారు.

వర్షం లేకపోయినా మ్యాచ్ రద్దవడం హాస్యాస్పదం
'వారికి అసలు క్రికెట్పై ఆసక్తే లేదు, వర్షం లేకపోయినా మ్యాచ్ రద్దవడం హాస్యాస్పదం, హెచ్సీఏకు కావాలంటే ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని కప్పి ఉంచే కవర్లను అందజేస్తాం. బీసీసీఐ ప్రతినిధులు దయచేసి అలాంటి కవర్లను హైదరాబాద్ స్టేడియం నిర్వాహకులకు కొని పెట్టండి' అంటూ ఛలోక్తులు విసిరారు.

శుక్రవారం వర్షం పడలేదు
నిజానికి శుక్రవారం నగరంలో వర్షం పడలేదు. దీంతో స్టేడియంపై కవర్లను తొలగించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో నగరంలో కాసేపు వర్షం పడింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు స్టేడియం చిత్తడిగా మారింది. కేవలం క్రీజు, 100 యార్డ్స్ సర్కిల్ను మాత్రమే కప్పి ఉంచిన సిబ్బంది, 100 యార్డ్స్ సర్కిల్ నుంచి బౌండరీ లైన్ వరకు వదిలేశారు.

అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతోనే ఈ నిర్ణయం
దీంతో మైదానంలోని అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారి, ఆటకు అనుకూలంగా లేకపోయింది. దీంతో బౌండరీ లైన్ వద్ద నేలను పరిశీలించిన అంపైర్లు స్టేడియం మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేదని ప్రకటించారు. ఈ కారణంగానే మూడు టీ20ల సిరిస్ విజేత ఎవరో తేల్చే మ్యాచ్ జరగకుండానే టోర్నీ ముగిసింది.

తొలి ప్రయత్నంలోనే విఫలమైన హెచ్సీఏ
అంతేకాదు అంతర్జాతీయ టీ20కి ఆతిథ్యమిచ్చిన తొలి ప్రయత్నంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఫెయిలయ్యింది. మ్యాచ్ రద్దు కావవడంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని హెచ్సీఏ ప్రకటించింది. ఏయే రోజుల్లో నగదు తిరిగిచ్చేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అప్పటివరకూ ప్రేక్షకులు టిక్కెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications