

మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మూడో వన్డే గెలవడం ద్వారా కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా టెస్ట్, వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరో వన్డే గెలిచింది. ఇప్పుడు మూడో వన్డే భారత్ గెలవడం ద్వారా సిరీస్ సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 49.2 ఓవర్లలో భారత్ 234 పరుగులు చేసింది. ఈ గెలుపులో ధోనీ అద్భుత పోరాట పటిమ కనబరిచారు.
ధోనీ 114 బంతుల్లో 87 పరుగులు (6×4) చేశాడు. కేదార్ జాదవ్ 57 బంతుల్లో 57 పరుగులు (6×4) పరుగులు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 116 బంతుల్లో 121 పరుగులు జోడించారు. కోహ్లీ 62 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అర్ధశతకం చేజార్చుకున్నాడు.