ఆస్ట్రేలియాకు మూడో అత్యుత్తమం
భారత్లో టీమిండియాపై ఆస్ట్రేలియాకు మూడో అత్యుత్తమంగా రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు అరోన్ ఫించ్-ఖవాజాలు దూకుడుగా ఆడి చక్కటి భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఆరోన్ ఫించ్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కుల్దీప్ బౌలింగ్లో ఫించ్ ఔట్
సెంచరీకి చేరువగా వచ్చిన ఫించ్ను కుల్దీప్ 32వ ఓవర్లో ఎల్బీగా ఔట్ చేసి ఉపశమనం కలిగించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు భారీ శుభారంభం అందించారు. వికెట్ తీసేందుకు ఆతిథ్య బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు యాదవ్ తొలి వికెట్ తీశాడు. అంతకుముందు 1986లో తొలిసారి జెఫ్ మార్ష్- డేవిడ్ బూన్ల జోడి 212 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తొలి వికెట్కు 231 పరుగుల భాగస్వామ్యం
ఆ తర్వాత 2017లో అరోన్ ఫించ్-డేవిడ్ వార్నర్ల జోడి 231 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇదే భారత్లో భారత్పై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక స్కోరు. తాజాగా మూడో వన్డేలో ఆరోన్ ఫించ్-ఖవాజల జోడి నమోదు చేసిన భాగస్వామ్య భారత్లో ఆస్ట్రేలియాకు మూడో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
భారత్పై భారత్లో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం సఫారీలదే
కాగా, భారత్పై భారత్లో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు మాత్రం దక్షిణాఫ్రికా జట్టు పేరిట ఉంది. 2000లో గ్యారీ కిరెస్టన్-గిబ్స్ల జోడి 235 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ రికార్డుని ఇప్పటివరకు ఏ జట్టూ అధిగమించలేకపోవడం విశేషం.