
నాథన్ లైయన్ను ఔట్ చేయడం
ఒక్క రెండో ఇన్నింగ్స్లోనే 6 వికెట్లతో చెలరేగిపోయాడు. టెస్టు క్రికెట్ కెరీర్లో (6/56) అతనికిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. నాలుగో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు నాథన్ లైయన్ను ఔట్ చేయడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో విదేశాల్లో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు.

విదేశాల్లో 40కిపైగా వికెట్లు తీసినట్లుగా
2018లో ఐదేసి వికెట్లు తీయడం పేసర్కు ఇది రెండోసారి. జనవరిలో దక్షిణాఫ్రికాతో జోహాన్నెస్ టెస్టులో షమీ(5/28) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 టెస్టులాడిన షమీ 27.07 సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ఓవర్సీస్ టూర్లలో 2006లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(41 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును షమీ తాజాగా అధిగమించాడు. ఈ ఇద్దరితో పాటుగా మరో భారత బౌలర్ ఎవ్వరూ ఒక క్యాలెండర్ ఇయర్లో విదేశాల్లో 40కిపైగా వికెట్లు తీసినట్లుగా నమోదుకాలేదు.

5 వికెట్లతో 175 పరుగుల దూరంలో
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఇంకో రోజు ఆట మిగిలిన ఈ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, హెజెల్ఉడ్ చెరో వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్కు ఒక వికెట్ లభించింది.


Click it and Unblock the Notifications












