
టాస్ ఓడి బ్యాటింగ్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడు ఓపెనర్ కేఎల్ రాహుల్, చివర్లో ధోని మెరుపులు జతకావడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ చక్కటి శుభారంభం అందించారు. దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 61 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అవుటయ్యాడు.

రిషబ్ పంత్ స్వల్ప స్కోరుకే
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(1) స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేరి నిరాశపరచగా... మరో ఓపెనర్ శిఖర్ ధావన్(14) వెంట వెంటనే పెవిలియన్కు చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది.

టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెచంరీ. ఇక, విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో నెమ్మదిగా ఆడి విమర్శలు పాలైన ధోని ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ధోని 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు.

దూకుడుగా ఆడిన ధోని
మరోవైపు విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ సిరిస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడినా లేక గెలిచిన అది రికార్డే.

టీమిండియా ఓడినా గెలిచినా రికార్డే
2008 మెల్బోర్న్లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు. చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది. నాలుగేళ్ల నుంచి స్వదేశంలో జరిగినా ఏ సిరీస్ను టీమిండియా కోల్పోలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ రికార్డు భారత క్రికెట్ జట్టు మరింతగా మెరుగుపరుచుకుంటుంది.

బుమ్రా మరో 2 వికెట్లు తీస్తే
ఒకవేళ ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే 11 ఏళ్ల తర్వాత భారత్పై టీ20 సిరిస్ను గెలిచినట్లు అవుతుంది. ఈ మ్యాచ్లో బుమ్రా రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అశ్విన్ (52) వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 6 సిక్సులు బాదడంతో, ధోని 3 సిక్సులు బాదడంతో 50 సిక్స్ల క్లబ్లో చేరారు.


Click it and Unblock the Notifications
