3-0:
నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు మ్యాచ్ల్లో భారత్నే విజయం వరించింది. 2009లో ఇదే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో 99 పరుగులు, 2013లో 6 వికెట్లు, 2017లో ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు గెలిచింది.
11-1:
2012 నుంచి విదర్భ వేదికగా జరిగిన 12 లిస్ట్-ఏ మ్యాచ్లలో ఇప్పటి వరకూ చేధనకు దిగిన జట్టే 11 సార్లు గెలిచింది. వన్డేల్లో మాత్రం ముందు బ్యాటింగ్ చేసిన జట్టు 2/8 సార్లు మాత్రమే విజయం సాధించింది.
10 పరుగుల దూరంలో:
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్లో 2000 పరుగులు చేయడానికి 10 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఈ రికార్డుని జడేజా అందుకునే అవకాశం ఉంది.
ఒక్క సిక్స్ కొడితే:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరొక సిక్స్ కొడితే 350 సిక్సులు బాది రెండో భారత్ ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.