Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంకిపెళ్లి సుబ్బు చావుకు: టీమిండియా ఓటమి దెబ్బ రవిశాస్త్రి మెడకు..ద్రవిడ్ రీప్లేస్ అంటూ..!

అడిలైడ్: ఒక్క దారుణ పరాజయం..భారత క్రికెట్ జట్టును అథోఃపాతాళానికి తొక్కేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా సాధించుకున్న ప్రతిష్ఠను మసకబారేలా చేసింది. 36 పరుగులకే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఓటమిని వైఫల్యాన్ని ఎప్పుడూ చూడలేదని అభిమానులు, నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వైఫల్యానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ravi

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ స్టేడియంలో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘోరంగా విఫలం చెందిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. టెయిలెండర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ షమీ చేతికి గాయం కావడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీనితో 36 పరుగుల వద్ద కేప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్‌లో సాధించిన ఆధిక్యతను కలుపుకొంటే.. 90 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఈ చిన్నపాటి లక్ష్యాన్ని ఛేదించే వైపు దూసుకెళ్తోంది ఆసీస్ టీమ్.

ఈ ఘోర పరాభవానికి, బ్యాటింగ్ వైఫల్యానికి క్రికెట్ అభిమానులు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఇంత దారుణ స్కోర్‌బోర్డును ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. దీనికి నైతిక బాధ్యతను హెడ్ కోచ్ రవిశాస్త్రి తీసుకోవాల్సి ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. రవిశాస్త్రిని వెంటనే తొలగించాలని పట్టుబడుతున్నారు. ట్వీట్లతో సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. రవిశాస్త్రికి బదులుగా టీమిండియా మాజీ కేప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని సూచిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్.. జట్టును విజయం వైపు నడిపించే సమర్థుడని కితాబిస్తున్నారు.

కేప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించి.. అతని స్థానంలో రోహిత్ శర్మను నియమించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. నిజానికి- విరాట్ కోహ్లీకి ఇదే చివరి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అనంతరం అతను స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోన్నాడు. మూడో టెస్ట్‌కు అజింక్య రహానే సారథ్యాన్ని వహించే అవకాశం ఉంది. చివరి రెండింటికీ రోహిత్ శర్మ పగ్గాలను అందుకోబోతోన్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ.. తన సారథ్యంలో చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించగలిగితే.. ఇక శాశ్వతంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

Story first published: Saturday, December 19, 2020, 23:04 [IST]
Other articles published on Dec 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+