భారత్కి ఎలా పోటీనిస్తుందోనని సర్వత్రా ఆసక్తి
దీంతో ఆస్ట్రేలియా జట్టు సొంతగడ్డపై భారత్కి ఎలా పోటీనిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన టీ20 సిరీస్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ అద్భుతమైన పామ్లో ఉండగా, విండిస్తో మూడు టీ20ల సిరిస్లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ చాలా రోజుల తర్వాత టీ20ల్లో ఆడుతున్నాడు.
పది మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్లు ఆడిన భారత్ జట్టు ఏకంగా పది మ్యాచ్ల్లో విజయం సాధించింది. మిగిలిన ఐదు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇందులో ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఆరు టీ20లు ఆడగా.. అందులోనూ నాలుగింట భారత్ గెలుపొందింది.
|
ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా
టీ20 జరుగుతున్న బ్రిస్బేన్ పిచ్ ఎక్కువగా పేసర్లకి అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు చోటు దక్కింది. ఈ మ్యాచ్లో ఇండియా ఫెవరేట్గా దిగుతోందని మాజీ ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ అంచనా వేస్తున్నాడు.
|
జట్ల వివరాలు:
భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
ఆస్ట్రేలియా తుది జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), క్రిస్ లిన్,డీఆర్క్ షార్ట్, బెన్ మెక్డెర్మాట్, గ్లెన్ మ్యాక్స్వెల్, స్టాయినిస్, బెరెన్డార్ఫ్, అలెక్స్ కేరీ, స్టాన్లేక్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా