
టాస్ ఓడి తోలుత బ్యాటింగ్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(10) వికెట్ను త్వరగానే కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను శిఖర్ ధావన్ తన భుజాలకెత్తుకున్నాడు.
ధావన్ హాఫ్ సెంచరీ
కేఎల్ రాహుల్ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ... శిఖర్ ధావన్ మాత్రం చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ధావన్కు ఇది 28వ హాఫ్ సెంచరీ.

రెండో వికెట్కు 121 పరుగులు
వీరిద్దరి జోడీ 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ముంగిట ఆస్టన్ అగర్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శిఖర్ ధావన్(91 బంతుల్లో 74, 9 ఫోర్లు, సిక్స్) సైతం ఔటయ్యాడు. దీంతో ఆరు పరుగుల వ్యవధిలో భారత్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది.

కోహ్లీకి అచ్చిరాని NO.4
ఆ తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఊరిస్తూ వేసిన బంతికి స్టయిట్ డ్రైవ్ కొట్టబోయి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు బంతిని సిక్స్ కొట్టిన కోహ్లి.. ఆపై మళ్లీ బంతిని హిట్ చేద్దామనుకునే వికెట్ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్ 156 పరుగుల వద్ద నాలుగో వికెట్ను కోల్పోయింది.

నిరాశ పరిచిన అయ్యర్
మరోవైపు శ్రేయస్ అయ్యర్(4) సైతం నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ కేరీ సునాయాసంగా అందుకున్నాడు. దీంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. అయ్యర్ స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.

ఆదుకున్న పంత్-జడేజా జోడీ
రిషబ్ పంత్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, రిచర్డ్సన్ వేసిన 43వ ఓవర్ తొలి బంతికి రవీంద్ర జడేజా(25) ఆష్టన్ టర్నర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 229 పరుగుల వద్ద ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో రిషబ్ పంత్(28) కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

శార్ధూల్ ఠాకూర్ మెరుపులు
ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్(10 బంతుల్లో 13, 2 ఫోర్లు) కాస్త మెరుపులు మెరిపించినప్పటికీ.... మిచెల్ స్టార్క్ ఓ అద్భుతమైన బంతికి అతడిని పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్(17), మహ్మద్ షమీ(10) స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. కానీ, ఆసీస్ బౌలర్లు రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది.


Click it and Unblock the Notifications












