బేబీబాస్కు నో ఛాన్స్?: గంభీర్ ప్లాన్ ఇదేనా?
IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య టీ20 సిరీస్లోని రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్లోనూ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో అవకాశం దక్కకుండా బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ దేశంలో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికీ.. భారత గడ్డపై స్వదేశీ అభిమానుల ముందు మ్యాచ్ ఆడే అవకాశం అతడికి మరింత ఆలస్యం కానుంది.
జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శన
అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలో ఇంగ్లాండ్ సిరీస్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే పర్యటనలో చెలరేగిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు ఆఖరి మ్యాచ్లో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత్ 3-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

జట్టు యాజమాన్యం వ్యూహం
గత సిరీస్లో అద్భుతంగా రాణించినప్పటికీ.. బెంచ్ బలం ఎక్కువగా ఉండటంతో వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సి వస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్లో సంజు శాంసన్ను రెండు మ్యాచ్లకే తొలగించి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సీనియర్ ఆటగాడైన సంజు శాంసన్ కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. జింబాబ్వే పర్యటనకు సంజు శాంసన్ దూరం కావడంతో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు ఇద్దరూ అందుబాటులో ఉండటంతో సంజు శాంసన్ కే తొలి ఛాన్స్ దక్కుతోంది.
సంజు శాంసన్ ఫామ్.. ఆసియా క్రీడలపై ప్రభావం
టీ20 ప్రపంచ కప్ తర్వాత సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఐర్లాండ్లో 5 పరుగులు, ఇంగ్లాండ్లో 28 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20లో కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు. ఒకవేళ మిగిలిన మ్యాచ్లలో కూడా సంజు శాంసన్ విఫలమైతే, రాబోయే ఆసియా క్రీడల కోసం భారత ఓపెనింగ్ జోడీ మారే అవకాశం ఉంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే ఆసియా క్రీడల కోసం జపాన్ పయనం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


