
హైదరాబాద్: టెస్టు క్రికెట్పై ఆసక్తిని పెంచేందుకు 2019 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆగస్టులో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా వెస్టిండిస్లో పర్యటించనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన వెస్టిండిస్తో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి ఈ పర్యటన మొదలు కానుంది. ఇండియా-వెస్టిండిస్తో ఆరంభమయ్యే టెస్టు సిరిస్తోనే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ మొదలు కానుంది.
వచ్చే రెండేళ్ల పాటు వివిధ జట్ల మధ్య ఈ టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. ఆగస్టు 22 నుంచి 26 వరకు జరగనున్న తొలి టెస్టుకు ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఆ తర్వాత ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరగనున్న రెండో టెస్టుకు జమైకా వేదిక కానుంది.
వెస్టిండిస్ పర్యటనలో
August 3: Ist T20I: Broward County Stadium, US
August 4: 2nd T20I: Broward County Stadium
August 6: 3rd T20I: Guyana National Stadium, Guyana
August 8: 1st ODI: Guyana National Stadium
August 11: 2nd ODI: Queen's Park Oval, Trinidad
August 14: 3rd ODI: Queen's Park Oval
August 17 to August 19: Tour Match - Coolidge Cricket Ground, Antigua
August 22 to August 26: 1st Test -- Vivian Richards Cricket Ground, Antigua
August 30 to September 3: 2nd Test - Sabina Park, Jamaica.