|
ఆర్మీ క్యాప్లు ధరించి ఆడడం సరికాదు
ఆర్మీ క్యాప్లు ధరించి క్రికెట్ ఆడడం సరికాదు అని అన్నాడు. క్రికెట్ను రాజకీయం చేస్తున్న బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని పాక్ సమాచారశాఖ మంత్రి ఫావద్ చౌదరీ తెలిపారు. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్లు ధరించిన అంశాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేయాలని మంత్రి ఫావద్ పాక్ క్రికెట్ బోర్డును కోరాడు.
పాక్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరిస్తారు
భారత్ ఇటువంటి చర్యలు మానుకోకపోతే పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరిస్తారన్నారని అన్నాడు. టోపీల వ్యవహారంపై పాక్కు చెందిన మరో మంత్రి కూడా స్పందించారు. భారత్ కాశ్మీర్లో చేస్తున్న దురాగతాలను ప్రపంచానికి చెప్తామని ఆయన ట్విటర్లో విమర్శించారు.
|
స్పష్టతనిచ్చిన బీసీసీఐ
అయితే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. ఆర్మీ క్యాప్లను ధరించడానికి ముందు ఐసీసీ సీఈఓ రిచర్డ్సన్ వద్ద బీసీసీఐ అనుమతులు తీసుకుందని అన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పిల్లల చదువు కోసం వినియోగించనున్నారు.