ముంబై: వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) శనివారం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో యువరాజ్ సింగ్కు తిరిగి స్థానం దక్కింది.
ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశం జట్టుతో జరిగే మూడు ట్వంటీ20 మ్యాచులకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. యువరాజ్ సింగ్కే కాకుండా ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు కూడా తిరిగి జట్టులో చోటు దక్కింది. వీరితోపాటు స్పిన్నర్ హర్భజన్ సింగ్కు టీ20 జట్టులో చోటు దక్కింది.
వన్డే జట్టులో సురేష్ రైనా స్థానం కోల్పోయాడు. టీ20 సిరీస్ జట్టులో మాత్రం ఉంటాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో చోటు కల్పించారు. జడేజాతో పాటు మహ్మద్ షమీకి వన్డే జట్టులో స్థానం దక్కింది.
ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన వన్డే, టీ20 జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. మార్చిలో భారత్లో జరిగే ట్వంటీ20 వరల్డ్ కప్ వరకూ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు ధోనీనే కెప్టెన్గా కొనసాగించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. స్టువర్ట్ బిన్నీకి రెండు జట్లలోనూ స్థాన దక్కలేదు.
వన్డే జట్టు
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, ఆక్సర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, గురుకీరత్ సింగ్, రిషీ ధావన్, బ్రైందర్ శ్రాన్
ట్వంటీ 20 జట్టు
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, హర్భజన్ సింగ్, ఉమేష్ యాదవ్, హర్దీక్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా