
కెప్టెన్గా రహానే:
న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టెస్ట్ స్పెసలిస్ట్ చటేశ్వర్ పుజారా అతడికి డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. రెండో టెస్టుకు కోహ్లీ తిరిగివచ్చి జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అప్పుడు కోహ్లీ కెప్టెన్గా.. రహానే వైస్ కెప్టెన్గా ఉండనున్నారు. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, రిషబ్ పంత్కు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్ టెస్ట్ జట్టులోకి వచ్చారు. ఇక తెలుగు ఆటగాడు హనుమ విహారి చోటు దక్కలేదు.

రోహిత్ శర్మకు పగ్గాలు:
భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్ (నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ (నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్కతా (నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో జట్టు పగ్గాలను స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అందించింది బీసీసీఐ. ఇకపై టీ20లకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీతో సహా రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు.

భారత టెస్టు జట్టు:
అజింక్య రహానే (కెప్టెన్), చేటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.


Click it and Unblock the Notifications












