కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఈరోజు మూడో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ విజృంభిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 24 పరుగులకే రెండు వికెట్లు (సచిన్ , గంభీర్ ) కోల్పోయింది. తొమ్మిది పరుగులకే సచిన్ అవుటయ్యాడు. ఓపెనర్ సెహ్వాగ్ , మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ యువరాజ్ లు అద్భుత సెంచరీలతో కదం తొక్కి భారత్ ను పటిష్ఠ స్థితిలో ఉంచారు. సెహ్వాగ్ 78 బంతుల్లో 101 పరుగులతో ఆడుతుండగా, యువరాజ్ సింగ్ 95 బంతుల్లో 117 పరుగులు చేసి మురళీధరన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం రైనా, సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నారు. 32 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.