జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ చెలరేగిపోయారు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ సిక్స్ లు, ఫోర్లతో ఇచ్చిపడేశిండు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. సూర్యా కుమార్ యాదవ్ 25 బంతుల్లో 4 సిక్స్ లు 6 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ
టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. . 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ముజారబానీ బౌలింగ్ లో షాట్ కు యత్నంచి మసకద్జాకు చిక్కాడు. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నిరాశ పరిచాడు రోహిత్ శర్మ. 8 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు.
రిషబ్ పంత్
ఆ తర్వాత వచ్చిన కోహ్లీ ఉన్నంత సేపు స్వేచ్ఛగా ఆడాడు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. సిక్స్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. దినేక్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 2 వికెట్లు తీయగా..రిచర్డ్ నగరవ, ముజారబానీని, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్-2 నుంచి భారత్ , పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లగా.. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్ కు వెళ్లాయి.