న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఇచ్చి పడేశిన సూర్య కుమార్, కేఎల్ రాహుల్.. జింబాబ్వే టార్గెట్ 187 పరుగులు..

 India scored 186 runs in the ongoing match against Zimbabwe

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ చెలరేగిపోయారు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ సిక్స్ లు, ఫోర్లతో ఇచ్చిపడేశిండు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. సూర్యా కుమార్ యాదవ్ 25 బంతుల్లో 4 సిక్స్ లు 6 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ
టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. . 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ముజారబానీ బౌలింగ్ లో షాట్ కు యత్నంచి మసకద్జాకు చిక్కాడు. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నిరాశ పరిచాడు రోహిత్ శర్మ. 8 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు.

రిషబ్ పంత్
ఆ తర్వాత వచ్చిన కోహ్లీ ఉన్నంత సేపు స్వేచ్ఛగా ఆడాడు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. సిక్స్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. దినేక్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 2 వికెట్లు తీయగా..రిచర్డ్ నగరవ, ముజారబానీని, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్-2 నుంచి భారత్ , పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లగా.. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్ కు వెళ్లాయి.

Story first published: Sunday, November 6, 2022, 15:26 [IST]
Other articles published on Nov 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X