నాటింగ్హామ్: రెండు టెస్టుల పరాజయం అనంతరం మూడో టెస్టులో టీమిండియా క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లు కూడా రాణించడంతో భారీ ఆధిక్యంతో టీమిండియా ఇంగ్లాండ్పై గెలుపొందింది. ఈ విజయం ఇంగ్లాండ్కు 1-2తో ఆధిక్యాన్ని తగ్గించింది. దీంతో టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా సీనియర్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బౌలర్లకూ.. స్లిప్లో ఉన్న ఫీల్డర్లకు కితాబులిస్తున్నారు.
జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను అంతకుముందు కంటే ఇప్పుడు కోలుకున్నాడు. ఇషాంత్ శర్మ కూడా అతనితో పాటుగానే సిద్డమవుతున్నాడు. అతను మణికట్టు గాయం నుంచి కోలుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనల్లో వారు అద్భుతంగా రాణిస్తున్నారు. అతని కెరీర్లో ఇంత అత్యుత్తమంగా బౌలింగ్ చేయడం ఇప్పుడే చూస్తున్నా' అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
'భారత్కు మరో లాభదాయకమైన ఫీచర్ ఏమంటే టీమిండియా స్లిప్ ఫీల్డింగ్లో చురుకుగా ఉంది. కేఎల్ రాహుల్ లీడింగ్లో వికెట్ల వెనుక పటిష్టమైన బృందమే నిల్చొంది. ఈ మధ్యనే అరంగ్రేటం చేసిన రిషబ్ పంత్.. గ్లౌజులతో ఆడుతుంటే అతని ఆటతీరు చూసి ఆశ్చర్యమేస్తుంది' అని తెలిపాడు.
ఫిట్నెస్కే ప్రాధాన్యమిస్తున్న బీసీసీఐ ఇప్పటికే జట్టులో కొనసాగుతోన్న దినేశ్ కార్తీక్.. మురళీ విజయ్లను తప్పించి పృథ్వీ షా.. హనుమ విహారీలకు చోటిచ్చింది. పూర్తి ఫిట్నెస్తో సఫారీ పర్యటనకు భారత్ ఏ జట్టు తరపున ఇంగ్లాండ్ గడ్డపై పరుగులు పారిస్తున్న వీళ్లు టీమిండియా తరపున ఎన్నికవడం విశేషం.