సౌతాంప్టన్: విదేశీ పర్యటనల్లో తామే అత్యుత్తమ జట్టుగా పేరు తెచ్చుకోవాలని టీమిండియా చాలా తాపత్రయపడింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి చేసి తమ ఉద్దేశ్యాన్ని వెల్లడించారు. అయితే వారి మాట కేవలం మొదటి ఫార్మాట్ అయిన టీ20 సిరీస్ వరకు మాత్రమే పరిమితమైంది.
కానీ, ఆ తర్వాత ఆడిన మ్యాచ్లలో కోహ్లీని మినహాయించి.. మిగిలిన బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. బౌలర్లు రోజు ఆరంభంలో, ముగింపులో అద్భుతంగా బంతులు విసిరినా మధ్యలో మాత్రం చతికిల పడ్డారు. చివరికి 5 టెస్టుల సిరీస్లో టీమిండియా ఓటమి భారంతో ఆస్ట్రేలియా బయలు దేరేందుకు సిద్ధమైంది. ఆ ఆఖరి ఐదో టెస్టు మాత్రం నామమాత్రంగా ఆడడం తప్ప ప్రయోజనమే లేదు.
{photo-feature}