

హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులు ప్రస్తుతం విజయానందంలో ఉన్నారు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో భారత జట్టు చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్పై రెండు సార్లు విజయం సాధించడమే ఇందుకు కారణంగా. టోర్నీలో భాగంగా లీగ్ మ్యాచ్లో పాక్పై రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఆదివారం దుబాయి వేదికగా జరిగిన సూపర్-4 మ్యాచ్లో సైతం టీమిండియా 9వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు రోహిత్ శర్మ (119 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 111 నాటౌట్), శిఖర్ ధావన్ (100 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 114) రాణించడంతో పాక్పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వీరిద్దరూ తొలి వికెట్కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. ఫలితంగా రోహిత్ శర్న నేతృత్ంలోని టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఇటు బౌలింగ్లోనూ, అటు బ్యాటింగ్లోనూ తడబడింది.
దీంతో పాకిస్థాన్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.