భారత్ మ్యాచ్లకు బాగా ఆదరణ
ఈ వరల్డ్కప్లో భారత్ మ్యాచ్లు బాగా ఆదరణ పొందాయి. "హాట్స్టార్ వంటి డిజిటల్ వేదికల్లో భారత్లో ఎక్కువగా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. భారత్-న్యూజిలాండ్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ని లైవ్ స్ట్రీమింగ్ను అత్యధికంగా 2.53 కోట్ల మంది చూశారు. లైవ్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్లో ఇదే అత్యధిక రికార్డు" అని ఐసీసీ వెల్లడించింది.
200 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో
ఈ మెగా టోర్నీని 200 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో 26 బ్రాడ్కాస్ట్ భాగస్వాములతో ప్రసారం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్స్, లైవ్, హైలెట్స్ 20,000 గంటలకు పైగా ప్రసారమయ్యాయి. గత ప్రపంచకప్తో పోలిస్తే ఈ వరల్డ్కప్ని 38 శాతం మంది అధికంగా వీక్షించారని ఐసీసీ పేర్కొంది.
వరల్డ్కప్ విజయవంతం
అన్ని రకాలుగా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్కప్ విజయవంతమైనట్లు ఐసీసీ తెలిపింది. రౌండ్రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ వరల్డ్కప్లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడగా... బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ను ఐసీసీ విశ్వవిజేతగా ప్రకటించింది.