
ఇండియా, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరిగే గబ్బా స్టేడియంలో వర్షం కురుస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ప్రారంభం కా వాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయితే ఓవర్లు కుదించనున్నారు. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు స్టేడియానికి చేరుకున్నాయి. మ్
మ్యాచ్ కు కట్ ఆఫ్ టైమ్ సాయంత్రం 4: 16గా ఉంది.
ఒక్కో మ్యాచ్
ఇరు జట్లు ఇప్పటికే ఒక్కో వార్మప్ మ్యాచ్ ఆడాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 50 పరులుగు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
98 పరుగులకే
చివర్లో మహ్మద్ షమీ చెలరేగడంతో ఇండియా విజయం సాధించింది. ఇత న్యూజిలాండ్ సౌతాఫ్రికాతో తలపడగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 98 పరుగులకే ఆలౌట్ అయింది.