For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ పొగరు.. ధోనీ ప్రశాంతత భారత్‌కు వరల్డ్‌కప్‌ను తీసుకొస్తుంది

India Need Virat Kohli's Aggression and MS Dhoni's Calmness To Win 2019 World Cup, Says Kapil Dev

హైదరాబాద్: క్రికెట్‌ మైదానంలో విరాట్‌ కోహ్లీ ఎంత దూకుడుగా కనిపిస్తాడో.. మహేంద్ర సింగ్‌ ధోనీ అంత ప్రశాంతంగా కనిపిస్తాడు. కోహ్లీ దూకుడు.. మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రశాంతత ఈ రెండు అంశాలు టీమిండియా 2019 ప్రపంచకప్‌ అందుకునేందుకు ఎంతో దోహదపడతాయని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌. భారత్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన సారథి కపిల్‌దేవ్‌.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'జట్టులో అందరూ దూకుడు ప్రదర్శించే ఆటగాళ్లు ఉన్నా ప్రమాదమే. అలాగని అందరూ ప్రశాంతంగా ఉన్నా కష్టమే. అందుకే ఈ రెండు కలిసి ఉండాలి. ఇది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని కపిల్‌ తెలిపాడు.

'తదుపరి ప్రపంచకప్‌లో భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ దూకుడు. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రశాంతత భారత్‌ మరోసారి ప్రపంచకప్‌ అందుకునేందుకు దోహదపడతాయి. ఇలాంటి కాంబినేషన్లు ఉండటంలో ఎలాంటి తప్పులేదు. జట్టుకు ఇది చాలా అవసరం. ఎలాగంటే మైదానంలో ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వారు ఆటను బాగా అర్థం చేసుకోగలరు. అలాగే మరోపక్క దూకుడు ప్రదర్శించే ఆటగాళ్లూ ఉండాలి' అని కపిల్‌దేవ్‌ వివరించాడు.

ప్రస్తుత టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలని మాజీ ఆల్‌రౌండర్, భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ సూచించారు. అతను మంచి ఆటగాడే కానీ, అతని నుంచి ఎక్కువగా ఆశిస్తుండటంతో ఒత్తిడి పెరిగి ఆడలేకపోతున్నాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి ఇన్నింగ్స్ ఆడి 93 పరుగులు చేసిన పాండ్యా మరే ఇన్నింగ్స్ లోనూ అంతగా రాణించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశాడు.

Story first published: Friday, March 2, 2018, 13:24 [IST]
Other articles published on Mar 2, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+