|
భారతే ఫేవరెట్:
తాజాగా కమ్రాన్ ఆక్మల్ మాట్లాడుతూ... 'బ్యాటింగ్, బౌలింగ్లో టీమిండియా సమతూకంగా ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు భీకర ఫామ్లో ఉన్నారు. ఇక ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి యార్కర్లకు బ్యాట్స్మన్ వద్ద సమాధానం లేకుండా పోతోంది. కచ్చితంగా భారత్ ఫైనల్ చేరుతుంది. ప్రపంచకప్ ప్రారంభం నుంచి భారతే నా ఫేవరెట్' అని కమ్రాన్ పేర్కొన్నాడు.
లేటుగా ఫామ్:
'పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం నిరాశ కలిగించింది. ప్రపంచకప్లో పాక్ ఆటగాళ్లు లేటుగా ఫామ్ అందుకున్నారు. టోర్నీ ఆది నుంచి ఆటగాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడితే పాక్ సెమీస్లో ఉండేది. కానీ దురదృష్టం వెంటాడింది. న్యూజిలాండ్, పాక్ జట్లు సమాన పాయింట్లు సాధించినా.. రన్రేట్ ఆధారంగా కివీస్ సెమీస్కు చేరింది' అని అక్మల్ అన్నారు. తొలి సెమీస్తో భారత్ విజయం సాధించాలని ఆక్మల్ కోరుకున్నారు. ఈ టోర్నీలో 9 మ్యాచ్లాడిన పాక్ 11 పాయింట్లు సాధించింది.
రిజర్వ్డేకు వాయిదా:
ఇక ప్రపంచకప్లో భాగంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్డే (బుధవారం)కు వాయిదా పడింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో మొదలైన వర్షం అనంతరం భారీగా పడడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పలు మార్లు వర్షం వచ్చి వెళుతుండడంతో అంపైర్లు మ్యాచ్ను బుధవారంకు వాయిదా వేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), లాథమ్ (3)లు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ బ్యాటింగ్తో మ్యాచ్ మొదలవుతుంది.