
ఏడుగురు బ్యాకప్ కెప్టెన్లా..?
'ప్రతిఒక్కరూ బ్యాకప్ కెప్టెన్సీ విషయమై మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతేడాది కాలంగా ఏడుగురు బ్యాకప్ కెప్టెన్లను టీమిండియా ప్రయోగించింది. టీమిండియా చరిత్రలో ఇంతమంది కెప్టెన్లను మార్చడం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా జట్టుకు వివిధ సిరీస్లలో కెప్టెన్లుగా వ్యవహరించారు. 1990లలో పాకిస్థాన్ జట్టు మేనేజ్ మెంట్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విఫలమైంది. ఇప్పుడు ఆ తప్పును భారత్ మళ్లీ చేస్తోంది' అని లతీఫ్ అన్నాడు.

మిడిలార్డర్, ఓపెనింగ్ స్లాట్ సమస్యాత్మకం
అలాగే సరైన మిడిలార్డర్ను, పర్ ఫెక్ట్ ఓపెనర్ను కనుగొనే విషయంలోనూ భారత్ వెనకంజలో ఉందన్నాడు. మిడిలార్డర్, ఓపెనింగ్ స్లాట్ లాంటి సమస్యాత్మక పొజిషన్లను భారత్ పరిష్కరించడం లేదని లతీఫ్ తెలిపాడు. అలాగే ఈ ఏడాది కెప్టెన్లుగా వ్యవహరించిన వాళ్లలో సైతం ఎవరూ జట్టుకు నిలకడగా రాణించే ప్లేయర్లు కాదని చెప్పాడు. సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లాంటి బలమైన నాయకుడు భారత్కు అవసరమని పేర్కొన్నాడు.

గంగూలీ, ధోనీ, కోహ్లీ లాంటి కెప్టెన్ కావాలి
'టీమిండియా పటిష్టమైన ఓపెనర్ను ఇంకా కనుగొనలేదు. వారికి స్థిరమైన మిడిలార్డర్ కూడా లేదు. ఎప్పుటికప్పుడు కొత్త కెప్టెన్లను మాత్రం తీసుకొస్తారు. పోనీ ఆ కెప్టెన్లు తమ ఆట విషయంలో పెద్దగా నిలకడ కూడా కనబర్చడం లేదు. కేఎల్ రాహుల్ ఇప్పుడు అన్ ఫిట్, రోహిత్ అంతకుముందు అన్ ఫిట్, విరాట్ మానసికంగా అసమర్థుడు. కాబట్టి ఇక భారత జట్టు మేనేజ్ మెంట్ ఆలోచించాల్సి ఉంటుంది. చాలా మంది కెప్టెన్లను మారుస్తున్నారు. దాని వల్ల లాభమేంటీ. టీమిండియాకు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెనే కావాలి' అని లతీఫ్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












