భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో సహా సహాయక కోచ్ల పదవి కాలంను బీసీసీఐ పొడిగించింది. ఈ మేరకు వినోద్ రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీవోఏ) నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి వీరి కాంట్రాక్టు ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్తో ముగియాలి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ల పదవీకాలం ఈ ప్రపంచకప్తో ముగియనుంది. అయితే వీరి కాంట్రాక్టు మరో 45 రోజులకు పొడిగిస్తున్నట్టు బీసీసీఐ అధికారిక వెబ్సైట్లో సీవోఏ వెల్లడించింది. కొన్ని చర్చల తర్వాత కాంట్రాక్టులను అడ్హక్ ఆధారంగా పొడిగించాలని సీవోఏ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ పేర్కొంది.
టాప్ జట్లు దక్షిణాఫ్రికాపై, ఆస్ట్రేలియాపై అద్భుత విజయాలు సాధించిన భారత్ గురువారం మరో కీలక మ్యాచ్కు రెడీ అయింది. ట్రెంట్బ్రిడ్జ్ మైదానం వేదికగా న్యూజిలాండ్తో భారత్ ఢీ కొననుంది.పేస్ బౌలింగ్ బలంతో కివీస్ విజయాల పరంపర కొనసాగిస్తుంటే.. బ్యాటింగ్, బౌలింగ్ తో భారత్ విజయాలను అందుకుంటోంది. బలాబలాలపరంగా చూస్తే భారత్ కివీస్ కంటే పటిష్టంగా ఉంది.
గాయం కారణంగా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్కు దూరమవడం జట్టుకు అసలైన సవాల్గా మారింది. ధావన్ దూరమవడంతో నాలుగో స్థానంలో కుదురుకున్న కేఎల్ రాహుల్ ఓపెనర్గా రానున్నాడు. అతను 'హిట్ మ్యాన్' రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఓపెనర్ పాత్ర రాహుల్కు కొత్త కాదు. వాస్తవానికి ప్రపంచకప్కు ఎంపిక చేసినప్పుడు కూడా సెలక్టర్లు మూడో ఓపెనర్గానే చూశారు. ఓపెనర్గా రాహుల్ రాణించిన సందర్భాలు ఉన్నాయి. కెరీర్లో అతని ఏకైక సెంచరీ ఓపెనర్గానే సాధించాడు. అయితే కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్లో అతను రోహిత్తో కలిసి ఎలాంటి ఆరంభం ఇస్తాడనేది చూడాలి.