నేపియర్ : న్యూజిలాండ్ పై తొలివన్డేలో భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 38 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ధోని (89 బంతుల్లో 84 పరుగులు), సెహ్వాగ్ (56 బంతుల్లో 77 పరుగులు), రైనా(39 బంతుల్లో 66) జట్టు విజయంలో పాలుపంచుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాంగ్ 28 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. మధ్యలో వర్షం రెండుసార్లు ఆటకు అంతరాయాన్ని కల్గించడంతో ఇన్నింగ్స్ ను 38 ఓవర్లకు కుదించారు.